ఆకర్షణీయమైన ధర, అప్ డేటెడ్ ఫీచర్లతో భారత్ లో పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో బలమైన పోటీ దారుగా నిలబడేందుకు మహీంద్రా XUV400 ప్రో ఎలక్ట్రిక్ SUV ని విడుదల చేసింది. ఈ కారును సంస్థ EC Pro, EL Pro(24.5kWh), EL Pro(39.4kWh) మూడు వెర్షన్లను తీసుకువచ్చింది.
మహీంద్రా XUV400 లో అతిపెద్ద అప్ డేట్.. 7 అంగుళాల టచ్ స్క్రీన్ కు బదులుగా 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్. ఇది మునుపటి వెర్షన్ కంటే మరింత లేటెస్ట్ గా కనిపిస్తుంది. ఇంకా 10.25 అంగుళా డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ కన్పోల్ కూడా అందించారు. దీని ద్వారా నావిగేషన్, మల్టీమీడియా ఇన్ ఫర్మేషన్, డ్రైవర్ అసిస్ట్ డేటా ను అందిస్తుంది.
మహీంద్రా XUV400 ఫీచర్లు:
టైర్ ప్రైజర్ అలర్ట్, డోర్ ఓపెనింగ్ అలర్ట్, ఓవర్ స్పీడ్ అలెర్ట్, జోయో ఫెన్స్ అలెర్ట్, హై టెంపరేచర్ అలెర్ట్, ఛార్జర్ ట్రబుల్ అలెర్ట్, రోడ్ సైడ్ అసిస్టెన్స్, వాలెట్ మోడ్, షేర్ మై లోకేషన్ వంటి ఫీచర్లను మహీంద్రా XUV400 అందిస్తోంది.
సేఫ్టీ ఫీచర్లను చూసుకుంటే మహీంద్రా XUV400 Pro భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో స్టాండర్డుగా 6 ఎయిర్ బ్యాగ్ లు, ESP, DBMS, IRVMతో ఆటో డిమ్మింగ్, 4 వీల్ డిస్క్ బ్రేక్ లు, ఐసోఫిక్స్ సీట్లు ఉన్నాయి.
మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్ కారు EL Pro లో ఒకటి 34.5 kWh బ్యాటరీ ప్యాక్ తో, 7.2 kW AC ఛార్జర్ తో అమర్చబడి ఉంటుంది. మరొకటి 39.4 kWh AC ఛార్జర్ తో వస్తుంది. ఇక ఎంట్రీ లెవెల్ EC ప్రో 34.5kWhబ్యాటరీ ప్యాక్, టైప్ 3.3 kW AC ఛార్జింగ్ ఆప్షన్ కలిగి ఉంది.
మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్ కారు ధర:
మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్ కారు పరిచయ ధర రూ. 15.49 లక్షలు. ఇది ఎక్స్ షోరూమ్ ధర. కాగా మహీంద్రా XUV400EL Pro లో భారీమార్పులు చేశారు. ముఖ్యంగా డ్యుయల్ టోన్ ఆప్షన్. గ్రే, బ్లాక్ కలర్లలో అందుబాటులో ఉంది. ఈ టాప్ ఎండ్ మోడల్ కు ప్రీమియం టుక్ అందించేందుకు శాటిన్ కాపర్ యాక్పెంట్లను, శాటిన్ క్రోమ్ తో AC వెంట్ లను అందించారు.
ఈరోజు శుక్రవారం (జనవరి 12) మధ్యాహ్నం నుంచి XUV400 ప్రో సిరీస్ బుకింగ్ లు ప్రారంభమయ్యాయి. ఆసక్తిగల కొనుగోలుదారులు రూ. 21వేల బుకింగ్ మొత్తంతో తమ ఇష్టమైన వాహనాన్ని బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు ఫిబ్రవరి 1, 2024న ప్రారంభం అవుతాయి. అయితే వీటి ప్రారంభ ధరలు మే 31 2024 వరకు డెలివరీలకు మాత్రమే వర్తిస్తాయి.