ఆదిపురుష్ : థియేటర్లలో జై హనుమాన్ పక్క సీట్లకు ఫుల్ గిరాకీ

ఆదిపురుష్ :  థియేటర్లలో జై హనుమాన్ పక్క సీట్లకు ఫుల్ గిరాకీ

పాన్‌ ఇండియా స్టార్  ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీ భారీ అంచనాల నడుమ 2023 జూన్ 16 శుక్రవారం రోజున రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన మూవీ రెండు ట్రైలర్స్, సాంగ్స్ సినిమా పైన భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అని అభిమానులు అనుకుంటున్నారు. 

అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఏదోక రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది.  వీటిపై మూవీ యూనిట్ కూడా ఎప్పటికప్పుడు స్పందిస్తూ క్లారిటీ ఇస్తూనే వస్తోంది. తాజాగా మరో రూమర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఇంతకీ అదేంటంటే ..  ఆదిపురుష్’ ప్రదర్శించే ప్రతీ థియేటర్‌లోనూ.. హనుమంతుడి కోసం  ప్రత్యేకంగా ఒక సీటును కేటాయిస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే . దీంతో  ఆ  ఖాళీ సీటుకు ఇరువైపులా ఉన్న సీట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది.  ప్రతిఒక్కరూ తమకు ఆ ఖాళీ సీటు పక్కనే కూర్చునే ఛాన్స్ రావాలని హనుమంతుడిని ప్రార్ధిస్తున్నారు.  

అయితే హనుమంతుడి సీటు పక్కన సీట్లకు టికెట్ ధర ఎక్కువ కేటాయిస్తున్నారన్న ప్రచారం ఊపందుకుంది. ఇరువైపులా సీట్లకు ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇస్తారో, వాళ్లకే ఆ సీట్లు దక్కుతాయన్నట్టుగా ఓ వార్త  సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. తాజాగా ఈ వార్తలకు మేకర్స్  క్లారిటీ ఇచ్చారు.  సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని,  ఇలాంటి తప్పుడు వార్తల్ని ఎవ్వరూ నమ్మొద్దు జై శ్రీరామ్ అంటూ టీ సిరీస్ సంస్థ ట్వీట్ చేసింది.  

రామాయణం ఇతిహాస కథతో వస్తున్న ఆదిపురుష్  సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపిస్తు్ండగా కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురిడిగా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ప్రీ బుకింగ్స్ ని ఓపెన్ చేసినట్లు మూవీ టీం అనౌన్స్ చేసింది. దీంతో ప్రభాస్ అభిమానులతో పాటు రాముడి కథని చూడాలనుకుంటున్న ప్రతి ఒక్కరు టికెట్స్ ని బుక్ చేసేసుకుంటున్నారు.

 

#FraudAlert ?

There are misleading reports circulating in the media regarding #Adipurush ticket pricing. We want to clarify that there will be no differences in rates for seats next to the one reserved for Hanuman Ji! Don't fall for false information!

Jai Shri Ram! ??

— T-Series (@TSeries) June 11, 2023