వివేక్​ వెంకటస్వామిని కలిసిన నేతలు

వివేక్​ వెంకటస్వామిని కలిసిన నేతలు

నవాబుపేట, వెలుగు: చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్​ వెంకటస్వామిని మంగళవారం మాలమహానాడు నాయకులు కలిశారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన వివేక్​ను సన్మానించి ప్రత్యేకంగా అభినంధించారు. మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య, రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్​రావు, జిల్లా అధ్యక్షుడు కావలి రమేశ్​ ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఉన్నారు. 

ఇదిలాఉంటే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను మండలంలోని యాన్మన్​గండ్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్​ సీనియర్​ నాయకులు ఖాజామహేక్​ హైదరాబాద్​లో కలిసి అభినంధనలు తెలిపి పూలమాలతో సన్మానించారు. ఆయన కుమారులు ఆల్​ ఇండియా సేవాదళ్​ ​ నాయకులు వాజీద్​మహేక్, హమీద్​మహేక్​ ఉన్నారు.