నవరాత్రుల వేడుకల సందర్భంగా పాట రాసిన మమత

నవరాత్రుల వేడుకల సందర్భంగా పాట రాసిన మమత

కోల్‌‌‌‌కతా:  కేంద్ర మంత్రి అరూప్‌‌‌‌ విశ్వాస్‌‌‌‌ ఆధ్వర్యంలో పశ్చిమ బెంగాల్‌‌‌‌ వ్యాప్తంగా చేపట్టిన సురుచి సంఘ దుర్గా పూజ వేడుకలకు ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ పాట రాశారు. మ్యూజిక్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ జీత్‌‌‌‌ గంగూలీ పాటను కంపోజ్‌‌‌‌ చేయగా ప్రముఖ బాలీవుడ్‌‌‌‌ సింగర్‌‌‌‌‌‌‌‌ శ్రేయా ఘోషల్ ఆ పాట పాడారు. “ఉత్సవ్‌‌‌‌’’ పేరుతో య్యూట్యూబ్‌‌‌‌లో ఈ పాటను విడుదల చేయగా.. తక్కువ టైంలో చాలా మంది ఆ పాటను  చూశారు. “ ఈ పండుగకు ప్రతి ఒకరు ఆహ్వానితులే, ప్రతి ఒకరిది ఈ పండుగ” అని అర్థం వచ్చేలా బెంగాలీలో పాటను చక్కగా రాశారని గంగూలీ అన్నారు. సురుచి సంఘ దుర్గా పూజకు ఐదు సంవత్సరాల నుంచి పాటను కంపోజ్‌‌‌‌ చేస్తున్నానని, మమత రాసిన పాటను కంపోజ్‌‌‌‌ చేయడం ఆనందంగా ఉందన్నారు.

Mamata Banerjee Gives Lyrics For Durga Puja Song