నోట్లో దాచి బంగారం అక్రమ రవాణా

నోట్లో దాచి బంగారం అక్రమ రవాణా

జైపూర్ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుబడింది. కస్టమ్స్ అధికారులు దాదాపు ఐదున్నర లక్షలు విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.  దుబాయ్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో వచ్చిన ప్రయాణికుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడు నోటిలో బటన్ల రూపంలో దాచిపెట్టిన బంగారాన్ని అధికారులు తనిఖీల్లో పట్టుకున్నారు. వెంటనే వాటిని సీజ్ చేశారు. పట్టుబడిన బంగారు బటన్ల విలువ దాదాపు 5.8 లక్షలు ఉంటుందని తెలిపారు. నిందితుడ్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. బంగారం ఎక్కడికి తరలిస్తున్నారో అన్న విషయాలపై ఆరా తీస్తున్నారు. 

ఇవి కూడా చదవండి: 

కరోనా టెస్టులపై ఢిల్లీ ఎయిమ్స్ కీలక నిర్ణయం

పేకాట ఆడిన ముఖ్యమంత్రి