గొంతులో కోడి ఎముక ఇరుకున్ని వ్యక్తి మృతి..

గొంతులో కోడి ఎముక ఇరుకున్ని వ్యక్తి మృతి..

మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం జరిగింది. కోడి ఎముక గొంతులో ఇరుక్కోవడంతో వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే మహబూబ్ నగర్ జిల్లా ఫరూఖ్ నగర్ మండలం ఎలికట్ట గ్రామంలో జితేంద్ర అనే వ్యక్తి కూలి పని చేస్తున్నాడు. బుధవారం భోజనం చేస్తున్న సమయంలో కోడి ఎముక గొంతులో ఇరుక్కుంది. 

దీంతో అతను ఊపిరి ఆడక స్పృహ కోల్పోయాడు. తోటి వారు అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అతను మృతి చెందినట్టుగా వైద్యులు నిర్ధారించారు. ఊపిరి ఆడకనే చనిపోయాడని వైద్యులు తెలిపారు.  బాధితుడు జార్ఖాండ్ రాష్ట్రానికి చెందినవాడు. వృత్తి రిత్య మాహబూబ్ నగర్ జిల్లాకు వచ్చామని తోటివారు చెప్పారు.