
జయశంకర్ భూపాలపల్లి: ఇసుక లారీ- RTC బస్సు ఒకదానికొకటి ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించాడు. ఈ సంఘటన జయశంకర్ భూపల్లి జిల్లాలో శుక్రవారం మధ్నాహ్నం జరిగింది. మహదేవపూర్-కాశేశ్వరం రహదారిలో అన్నారం మలుపు దగ్గర జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో మరో 10 మందికి పైగా గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమం ఉంది.
సమాచారం అందుకున్న పోలీసులు గాయపడ్డవారిని ట్రీట్ మెంట్ కోసం వరంగల్ ఎంజీఎం హస్పిటల్ కి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. మృతుడిని చేల్పూరు వాసి పనగంటి సమ్మయ్య(40)గా గుర్తించారు.