రేషన్ బియ్యం అమ్మే వ్యక్తికి ఏడాది జైలు శిక్ష

రేషన్ బియ్యం అమ్మే వ్యక్తికి ఏడాది జైలు శిక్ష

భద్రాచలం, వెలుగు :  పేదలకు ప్రభుత్వం అందించే రేషన్​ బియ్యాన్ని అక్రమంగా అధిక ధరలకు అమ్ముతున్న ఆచంట వెంకట సీతామాధవరావు అనే వ్యక్తికి ఏడాది జైలు శిక్ష, రూ.1000 జరిమానాను విధిస్తూ ఫస్ట్ క్లాస్​ మెజిస్ట్రేట్​ శివనాయక్ బుధవారం తీర్పునిచ్చారు.

మెడికల్​ కాలనీకి చెందిన ఆయనపై 2021 జూన్​ 23న కేసు నమోదైంది. పీడీఎస్​ బియ్యాన్ని ప్రభుత్వం నిరుపేదలకు అందిస్తుందని, ప్రజాప్రయోజనాలకు వ్యతిరేకంగా ముద్దాయి నేరం చేశారనే పరిగణనలోకి తీసుకుని శిక్ష విధించారు.