సింగరేణిలో ఎస్సీ, ఎస్టీ లైజన్ ఆఫీసర్ల నియామకం

సింగరేణిలో ఎస్సీ, ఎస్టీ లైజన్ ఆఫీసర్ల నియామకం

కోల్​బెల్ట్​,వెలుగు: సింగరేణి ఎస్సీ, ఎస్టీ లైజన్​ఆఫీసర్లను నియమిస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. సింగరేణి వ్యాప్తంగా ఏడు ఏరియాలకు కొత్త లైజన్​ఆఫీసర్లను నియమించింది. శ్రీరాంపూర్​ ఏరియాకు డీజీఎం ఆనంద్​కుమార్​, ఎస్టీపీపీ ఏరియాకు డీజీఎం జనగామ శ్రీనివాస్, మందమర్రి ఏరియాకు ఈఎం ఎస్ఈ చంద్రమౌళి, బెల్లంపల్లి ఏరియాకు సీనియర్​పీవో డి.ప్రసాంత్, కొత్తగూడెం కార్పొరేట్​ఏరియాకు డీవైసీఎంవో కొమ్ము మాలతి, రామగుండం-–2 ఏరియాకు డీజీఎం ఎస్​.సంతోష్​కుమార్, రామగుండం-–3 ఏరియాకు అడిషనల్​మేనేజర్​జి.మహేశ్​నియమితులయ్యారు.  సింగరేణిలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు సంబంధించిన  ప్రమోషన్లు,ఇతర సమస్యల పరిష్కారానికి లైజన్​ఆఫీసర్లు చొరవ చూపాలని సింగరేణి ఎస్సీ,ఎస్టీ ఉద్యోగుల సంఘం కోరింది.