ప్రముఖ కమెడియన్ టిల్లు వేణు దర్శకత్వంలో తెరకెక్కి, ఇటీవలే విడుదలై, భారీ రెస్పాన్స్ ను అందుకుంటోన్న "బలగం" సినిమా నటులను మంచు మోహన్ బాబు, విష్ణులు అభినందించారు. ఎలాంటి అంచనాలు లేకుండా ఒక చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీపై ప్రశంసలు కురిపించారు. ఆ తర్వాత బలగం డైరెక్టర్ వేణుతో పాటు సినిమాలో నటించిన హీరో ప్రియదర్శినిని, సినిమాలో సాయిలు కూతురు క్యారెక్టర్ చేసిన రూపాలక్ష్మిని సన్మానించారు. బలగం సినిమాను వీక్షించిన మోహన్ బాబు, విష్ణులు సినిమా అద్భుతంగా ఉందని కొనియాడారు.
మార్చి 3న రిలీజైన 'బలగం' సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. విడుదలైన మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటోంది. అంతే కాకుండా ఇటీవల ఈ సినిమా లాస్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డులలో రెండు పురస్కారాలను సాధించింది. అంతే కాకుండా ఒనికో ఫిలిం ఫెస్టివల్ లో (ఉక్రెయిన్) బెస్ట్ డ్రామా ఫీచర్ ఫిల్మ్ విభాగంలో 'ఒనికో ఫిల్మ్ అవార్డు' గెలుచుకుని రికార్డు సృష్టించింది.