బీజింగ్: చైనా కరోనా కారణంగా చనిపోయిన వారిలో ఎక్కువ మందికి వెంటిలేటర్ సపోర్ట్ సరైన సమయానికి అందలేదంట. సరైన సమయానికి వెంటిలేటర్ అందుబాటులో ఉన్న 5 పేషెంట్లలో ఒకరు మాత్రమే చనిపోయారంట. కావాల్సినన్నీ వెంటిలేటర్లు అందుబాటులో ఉంటే చాలా మంది చనిపోయే వారు కాదని ఓ స్టడీలో తేలింది. అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్స్ ఈ స్టడీలోని అంశాలను ప్రచురించింది. చైనా లోని వుహాన్ లో 21 హాస్పిటల్స్ చనిపోయిన 168 మంది పేషెంట్లకు ఇచ్చిన ట్రీట్ మెంట్ ను అధ్యయనం చేశారు. జనవరి 21 నుంచి 30 తేదీల్లో వీరంతా కరోనా ఎఫెక్ట్ తో మృతి చెందారు. వీరిలో 46 మందికి మాత్రమే చనిపోయే ముందు వెంటిలేటర్ల సహాయం అందిందని గుర్తించారు. మిగతా వారందరికీ ఆక్సిజన్ థెరపీ చేసినప్పటికీ వారు చనిపోయే ముందు శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడగా ఆ సమయంలో వారికి వెంటిలేటర్ అందుబాటులో లేదంట. 72 మంది పేషెంట్లు శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతున్న డాక్టర్లు ఏమీ చేయలేకపోయారు. మరో 34 మంది పేషెంట్లకు లేటుగా వెంటిలేటర్ల సపోర్ట్ ఇచ్చినప్పటికీ వారు ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది పేషెంట్ల బ్లడ్ లో ఆక్సిజన్ లెవల్స్ లో గా ఉండటం తప్ప మిగతా ఏ సమస్య లేదని అధ్యయనంలో తేలింది. అంటే వెంటిలేటర్లు సమయానికి అందించి ఉంటే ఎక్కువ మంది బ్రతికేవారంట. ఇక కరోనాతో చనిపోయిన వారిలో కామన్ గా హై బీపీ ఉన్నట్లు కూడా ఈ స్టడీలో తేలింది.
వెంటిలేటర్స్ సపోర్ట్ ఆలస్యమవ్వటంతోనే
- విదేశం
- April 11, 2020
లేటెస్ట్
- IPL 2024: సన్ రైజర్స్ ఘోర ఓటమి..6 ఓటముల తర్వాత ఆర్సీబీ విజయం
- పటాన్ చెరులో భారీగా గంజాయి పట్టివేత
- తెలంగాణ కోసమే దేవుడు నన్ను పుట్టించిండు:కేసీఆర్
- హార్లిక్స్ హెల్త్ డ్రింక్ కాదు..ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్
- PM Kisan: రైతులకు పీఎం కిసాన్ 17వ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలుసా?
- జగన్ కోసం జనంలోకి భారతి..
- బర్గర్ ఒకరి ప్రాణం తీసింది.. మరొకరిని జైలుకు పంపింది..
- కాంగ్రెస్ లేకుండా చేయాలనుకుండు.. కేసీఆరే ఖతం అయ్యిండు: రాజగోపాల్ రెడ్డి
- IPL 2024: పటిదార్, కోహ్లీ మెరుపులు.. సన్ రైజర్స్ ముందు భారీ లక్ష్యం
- ఓట్ల కోసమే బీజేపీ తలంబ్రాల రాజకీయం: పొన్నం ప్రభాకర్
Most Read News
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- కోహ్లీ కోసం..ఉప్పల్లో ఆర్సీబీతో సన్రైజర్స్ మ్యాచ్..అందరి ఫోకస్ విరాట్పైనే
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- ఏప్రిల్ 26న ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఆంక్షలు
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- Good Health : వయస్సుకు తగ్గట్టు ఎక్సర్ సైజ్ చేయాలి.. ఎలా పడితే అలా చేస్తే అనారోగ్యమే..!
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు