జూన్ 10 భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు

జూన్ 10 భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు

భద్రాచలం, వెలుగు: మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్​సహా 27 మందిని ఎన్​కౌంటర్​ చేయడాన్ని నిరసిస్తూ జూన్​10వ తేదీన భారత్​బంద్​కు పిలుపునిస్తూ ఆ పార్టీ కేంద్ర అధికార ప్రతినిధి అభయ్​శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. 

జూన్​11వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు దేశవ్యాప్తంగా నంబాల సహా 27 మంది అమరవీరులను స్మరించుకుంటూ స్మారకసభలు జరపాలని కోరారు. నంబాల కేశవరావును ఎన్​కౌంటర్​ చేసిన మే 21వ తేదీ చీకటి రోజు అంటూ అభివర్ణించారు.