
భద్రాచలం, వెలుగు: మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్సహా 27 మందిని ఎన్కౌంటర్ చేయడాన్ని నిరసిస్తూ జూన్10వ తేదీన భారత్బంద్కు పిలుపునిస్తూ ఆ పార్టీ కేంద్ర అధికార ప్రతినిధి అభయ్శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
జూన్11వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు దేశవ్యాప్తంగా నంబాల సహా 27 మంది అమరవీరులను స్మరించుకుంటూ స్మారకసభలు జరపాలని కోరారు. నంబాల కేశవరావును ఎన్కౌంటర్ చేసిన మే 21వ తేదీ చీకటి రోజు అంటూ అభివర్ణించారు.