నాగర్ కర్నూల్ లో ఎంతో అభివృద్ధి చేశా : మర్రి జనార్దన్ రెడ్డి 

నాగర్ కర్నూల్ లో ఎంతో అభివృద్ధి చేశా : మర్రి జనార్దన్ రెడ్డి 

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : గత 9 సంవత్సరాల్లో నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశానని బీఆర్ఎస్​ అభ్యర్థి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి  చెప్పారు. మంగళవారం తిమ్మాజిపేట, బిజినేపల్లి, నాగర్ కర్నూల్ బస్టాండ్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  గతంలో నాగర్ కర్నూల్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో ప్రజలకు తెలుసున్నారు.  పట్టణం సుందరంగా తయారైందన్నారు.

జిల్లా ఏర్పాటు, మెడికల్ కాలేజీ,  రోడ్డు వెడల్పు, మినీ ట్యాంక్, సీసీ రోడ్లు  ఇలా ఎన్నో డెవలప్ మెంట్​ పనులు చేశానని ఆయన తెలిపారు. మళ్లీ గెలిచిన తర్వాత రెండు నెలల్లో ఇంజినీరింగ్ కాలేజీ, సాఫ్ట్ వేర్, ఐటీ కంపెనీలను ఏర్పాటు చేయిస్తానన్నారు. కాంగ్రెస్ ను నమ్మితే నాగర్ కర్నూల్ 30 ఏళ్లు వెనక్కి పోతోందన్నారు. ఐదేళ్లకోసారి పార్టీ మారే వ్యక్తిని కాదన్నారు. నాగం జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి 2018 ఎన్నికలలో తనను ఓడించడానికి ప్రయత్నం చేశాడన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి జమున, డీసీసీబీ డైరెక్టర్  రఘునందన్ రెడ్డి, నాగం శశిధర్ రెడ్డి  పాల్గొన్నారు.