లాక్డౌన్ తర్వాత పిరమైన వంట సామాన్లు
భారీగా పెరిగిన మంచి నూనె
బ్రాండ్ను బట్టి లీటరుకు రూ.50 నుంచి రూ.60 దాకా
పప్పు, కారం, బియ్యం రేట్లకు రెక్కలు
వాటి బాటలోనే కూరగాయలు
హైదరాబాద్, వెలుగు:మంచినూనె కాగిపోతున్నది.. చక్కెర చేదెక్కుతున్నది.. కారం మండిపోతున్నది.. ఒక్కటేంటి ఇంటి సామాన్లను ఏది చూసినా మస్తు పిరమై కూర్చున్నయి. చేతికి అందనంటున్నయి. ఓ సగటు శ్రమజీవిని పరేషాన్ చేస్తున్నయి. లాక్డౌన్ తర్వాత వంటసామాన్ల ధరలు భారీగా పెరిగాయి. అసలే కరోనా లాక్డౌన్తో ఉపాధి పోయి చాలా మంది కూలీలు, కార్మికులకు అప్పట్లో పూట గడవడమే కష్టమైంది. లాక్డౌన్ అయిపోయాక కూలీలు దొరుకుతున్నా.. పెరిగిన సరుకులు, కూరగాయల ధరలతో పూటగడవడం కష్టమవుతోంది. మిడిల్ క్లాస్ వాళ్లు తమ నెల వంట సామాన్లలో కోతలు పెట్టుకోవాల్సిన పరిస్థితి.
అన్ని సామాన్లలోకెల్ల మంచినూనెల రేట్లు భారీగా పెరిగాయి. బ్రాండ్ను, మంచినూనె రకాన్ని బట్టి లీటరుకు 50 రూపాయల నుంచి 60 రూపాయల దాకా ధరలు ఎక్కువయ్యాయి. లాక్డౌన్కు ముందు మార్చిలో లీటర్ పల్లీ నూనె ధర సగటున రూ.140 దాకా ఉండగా.. ఇప్పుడు బ్రాండ్ను బట్టి లీటరు రేటు రూ.175 నుంచి రూ.200 దాకా పెరిగింది. సగటున ఒక్క లీటర్ ఆయిల్ ప్యాకెట్ ఎంఆర్పీ రూ.164కు పెరిగింది. దీంతో చాలా మంది మంచినూనె వాడకం తగ్గించుకుంటున్నారు. ఐదు లీటర్లు కొనే దగ్గర రెండు మూడు లీటర్లతోనే సరిపెట్టుకుంటున్నారు. పప్పులు, ఉప్పుల రేట్లు కూడా పెరిగాయి. కందిపప్పు కిలోకు రూ.35 పెరగ్గా, శనగపప్పుపై రూ.15 వరకు పెరిగింది. అన్ని రకాల సన్న బియ్యంపై కిలో రూ.5 నుంచి రూ.10 వరకు ఎక్కువయ్యాయి. లాక్డౌన్ టైంలో నో స్టాక్ పేరిట చాలా షాపుల్లో ధరలు పెంచి నిత్యావసరాలను అమ్మారు. అయితే, ఇప్పుడు డైరెక్ట్గా కంపెనీలే ఎంఆర్పీని పెంచేశాయి. దీంతో సామాన్యులపై భారం పడుతోంది. చాలా మంది ధరలు ఎక్కువున్న కొన్ని వస్తువుల జోలికే వెళ్లడం లేదు. అత్యవసరమైనవి, ధర పెద్దగా పెరగని సామాన్లనే కొంటున్నారు.
లాక్డౌన్లోనే తక్కువున్నయ్
లాక్డౌన్ టైంలో కూడా ధరలు గింతగనం లేవు. వంట సామాన్లు, కాయగూరల ధరలు అన్ని ఎక్కువగానే ఉన్నాయి. రోజూవాడే పప్పు, ఉప్పు, కారం, పసుపు, నూనె, పాలు, గుడ్లు ఇలా అన్నింటి ధరలు ఒక్కసారిగా పెరిగినయి. కొన్ని వస్తువులను కొనలేక.. ఏదైతే అత్యవసరముంటుందో ఆ వస్తువులు మాత్రమే కొంటున్నం. – సుదర్శన్, వినియోగదారుడు
కాయగూరల ధరలు అంతే…
వంట సామాన్ల బాటలోనే కాయగూరల ధరలూ మండిపోతున్నాయి. ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఏది కొందామన్నా కిలో 50 రూపాయలకు తక్కువ లేవు. ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, బెండకాయ, వంకాయ, బీరకాయ, బీన్స్, క్యాబేజ్, పచ్చిమిర్చి.. ఇట్ల ఏది పట్టినా రేట్లు భగ్గుమంటున్నయి. నగర శివారు ఏరియాల్లో కాయగూరల సాగు తగ్గడంతో ఈ పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. నిజానికి ప్రతి చలికాలంలో కాయగూరల ధరలు తగ్గుతాయి. కానీ ఈ ఏడాది ధరలకు రెక్కలొచ్చాయి. గుడిమల్కాపూర్, బోయిన్పల్లి, ఎల్బీనగర్, సికింద్రాబాద్ మోండా, మాదన్నపేట వంటి మార్కెట్లతో పాటు గ్రేటర్ పరిధిలోని 11 రైతుబజార్లకు రోజువారీగా కాయగూరల రాక తగ్గిపోయింది. దీంతో ధరలు విపరీతంగా పెరిగాయి.
లాక్డౌన్ తర్వాత పిరమైన వంట సామాన్లు
- బిజినెస్
- December 22, 2020
లేటెస్ట్
- PAK vs NZ: భారీ వర్షం.. పాకిస్తాన్ vs న్యూజిలాండ్ మ్యాచ్ ఆలస్యం
- కెనడా చరిత్రలో అతిపెద్ద దోపిడీ కేసు:ఇద్దరు ఇండియన్లు అరెస్ట్
- పంద్రాగస్టులోపు రూ.2 లక్షల రుణమాఫీ పెద్ద బోగస్ : బండి సంజయ్
- MI vs PBKS: సూర్య హాఫ్ సెంచరీ.. భారీ స్కోర్ దిశగా ముంబై
- Balram Mattannur: ప్రముఖ సినీ రచయిత బలరామ్ కన్నుమూత
- రసాభాసగా మారిన లింగోజిగూడ,చంపాపేట డివిజన్ కార్యకర్తల సమావేశం
- కోటల్లో ఉండే జగన్.. ఇప్పుడు సిద్ధం అంటున్నారు.. జగన్ పై షర్మిల ఫైర్..
- IPL 2024: ధోనికి చేరువగా.. ఐపీఎల్లో రోహిత్ శర్మ మరో ఘనత
- కర్ణాటకలో దారుణం.. ప్రేమకు నో అందని కత్తితో పొడిచి చంపేశాడు
- మీ ఫోన్ హీటెక్కుతుందా..ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
Most Read News
- మామిడి ధర రూ.40వేలకు డమాల్
- యాదగిరిగుట్టలో ఉత్తర్వులను తుంగలో తొక్కిన భద్రతా సిబ్బంది..
- నెరవేరనున్న దశాబ్దాల కల
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్
- IPL 2024: ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు ఓపెన్.. బుక్ చేసుకోండి
- హైదరాబాద్ లో వర్షం.. భారీ ఈదురుగాలులతో ఉరుములు
- మాదాపూర్లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు స్టూడెంట్స్ అరెస్ట్
- షుగర్ లెవెల్ పెరగాలని కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటుండు : ఈడీ
- IPL 2024: అందమైన అభిమానిని చూసి కంట్రోల్ తప్పిన గిల్