భద్రాచలం, వెలుగు : చత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో నలుగురు మావోయిస్టులు లొంగిపోయినట్టు బస్తర్ఐజీ సుందర్రాజ్ శుక్రవారం తెలిపారు. వారి వద్ద ఉన్న ఎస్ఎల్ఆర్, ఇన్సాస్, 303, 315 బోరు తుపాకులను అప్పగించినట్టు చెప్పారు. లొంగిపోయిన మావోయిస్టులు జిల్లాలోని గొల్లపల్లి, కిష్టారం, కుంట ఏరియాలకు చెందినవారని తెలిపారు.
ఏరియా కమిటీ మెంబర్ సోడి జోగాపై రూ.5లక్షల రివార్డు, ఎల్ఓఎస్ సభ్యులు డాబ్రా గంగ, సోడె రాజే, మాడవి బుదరీలపై రూ. లక్ష చొప్పున రివార్డు ఉందన్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు చత్తీస్గఢ్ ప్రభుత్వం పునరావాస పథకం కింద పరిహారం, ఉపాధి కల్పిస్తామని బస్తర్ఐజీ సుందర్రాజ్తెలిపారు. ఎస్పీ కిరణ్చౌహాన్ ఉన్నారు.
