యాదాద్రి, వెలుగు: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా భువనగిరికి చెందిన మాయ దశరథ ఎంపికయ్యారు. పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించే ఆయన భువనగిరి మున్సిపాలిటీలో కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. గత పాలక వర్గంలో ఆయన వైస్ చైర్ పర్సన్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన ఎన్నిక పట్ల పార్టీ నేతలు హర్షం ప్రకటించారు.
