
హైదరాబాద్, వెలుగు: సింగపూర్లో జూన్ 2 నుంచి 4 వరకు జరగనున్న తొమ్మిదో ప్రపంచ నగరాల సదస్సులో పాల్గొనాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి ఆహ్వానం అందింది. సింగపూర్ కౌన్సిల్ జనరల్ ఎడ్గర్ పాంగ్ గురువారం హెడ్డాఫీసులో మేయర్ ను కలిసి ఆహ్వానించారు.
.లివబుల్ అండ్ సస్టైనబుల్సిటీస్, రిజివేనేట్, రీఇన్వెంట్, రీ ఇమేజిన్ అంశాలపై సదస్సులో చర్చించనున్నారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి హైదరాబాద్ లో జరిగిన అభివృద్ధిని వివరించారు. కార్యక్రమంలో వైస్ కౌన్సిల్ మిస్ నికొల్ చెన్ తదితరులు పాల్గొన్నారు.