భూతగాదాలు లేని జిల్లాగా తీర్చిదిద్దాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

భూతగాదాలు లేని జిల్లాగా తీర్చిదిద్దాలి :  కలెక్టర్ రాహుల్ రాజ్
  •     కలెక్టర్​ రాహుల్​ రాజ్​

మెదక్​టౌన్, వెలుగు: భూతగాదాలు లేని జిల్లాగా మెదక్​ను తీర్చిదిద్దాలని భూమి నక్ష, మ్యాప్, హద్దుల నిర్ణయం పటిష్టంగా ఉండాలని కలెక్టర్​రాహుల్​రాజ్​ అధికారులకు సూచించారు. ఈ మేరకు మెదక్​ మండలంలోని పాషాపూర్​లో గురువారం గ్రామసభ నిర్వహించారు. కలెక్టర్​ మాట్లాడుతూ..భూభారతి చట్టం ద్వారా అన్ని భూ సమస్యలు పరిష్కారమవుతాయని, పాషాపూర్  లో భూభారతి చట్టం భూముల రీసర్వే కార్యక్రమం నిర్వహించుకోవడనికి గ్రామసభ ఏర్పాటు చేసినట్లు వివరించారు. డిజిటల్ సర్వేతో హద్దుల నిర్ణయించి సర్వే చేస్తామని చెప్పారు.  

ఈ రీసర్వే అనంతరం రైతులు ఎక్కడున్నా తన భూమిని పరిశీలించుకోవచ్చని చెప్పారు. అనంతరం జిల్లాలోని 23 గ్రామాల్లో భూభారతి భుముల రీసర్వే చేసి సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని కలెక్టర్​తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్​ నగేశ్, తహసీల్దార్​లక్ష్మణ్​బాబు, సర్పంచ్,  అధికారులు పాల్గొన్నారు.