
రెండేళ్ల క్రితం ‘ఇచట వాహనములు నిలుపరాదు’ చిత్రంతో టాలీవుడ్కు పరిచయమైన మీనాక్షి చౌదరి.. వరుస సినిమాలతో తెలుగులో బిజీ అవుతోంది. తాజాగా వరుణ్ తేజ్కి జంటగా ఆమెను ఎంపిక చేశారు. ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ డైరెక్షన్లో వరుణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కబోతోంది. తన కెరీర్లో ఇది 14వ చిత్రం. మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు.
ఇందులో హీరోయిన్గా మీనాక్షి చౌదరిని ఫైనల్ చేశారు. 1960 బ్యాక్డ్రాప్లో తెరకెక్కనున్న ఈ పీరియాడిక్ మూవీలో మీనాక్షి పాత్ర కీలకంగా ఉండబోతోంది. నటనకు ప్రాధాన్యత గల పాత్రలో ఆమె కనిపించబోతోంది. టాలెంటెడ్ టెక్నీషియన్స్ వర్క్ చేయనున్న ఈ సినిమాని జులై 27న హైదరాబాద్లో ప్రారంభించబోతున్నారు.