రూ.4,250 కోట్ల సేకరణకు.. మీషో ఐపీఓ

రూ.4,250 కోట్ల సేకరణకు.. మీషో ఐపీఓ

న్యూఢిల్లీ:సాఫ్ట్‌‌బ్యాంక్‌కు పెట్టుబడులు ఉన్న ఈ–కామర్స్ సంస్థ మీషో  మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి ఐపీఓ కోసం డాక్యుమెంట్లను అందజేసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. గత నెల 25న జరిగిన అసాధారణ సర్వసభ్య సమావేశంలో ఐపీఓను ప్రారంభించాలన్న తీర్మానాన్ని ఆమోదించారు. 

పబ్లిక్ ఆఫరింగ్‌‌ ద్వారా కనీసం రూ. 4,250 కోట్లు సేకరించాలని కంపెనీ భావిస్తోంది.  సెకండరీ షేర్ సేల్ వంటి వివరాలు తెలియలేదు.  అయితే కంపెనీ కాన్ఫిడెన్షియల్​ రూట్​ విధానంలో ఐపీఓ పేపర్లను అందజేసింది. 

మీషో పబ్లిక్ మార్కెట్ లిస్టింగ్‌కు మరో అడుగు ముందుకు వేసింది.దలాల్ స్ట్రీట్‌కు వెళ్తున్న కొత్త తరం కంపెనీల జాబితాలో చేరింది. గత రెండు వారాల్లోనే పైన్ ల్యాబ్స్, వేక్‌ఫిట్, క్యూర్‌ఫుడ్స్, షాడోఫ్యాక్స్ అన్నీ ప్రాథమిక మూలధనంలో మొత్తం రూ. 6,000 కోట్లను సేకరించడానికి తమ DRHPలను దాఖలు చేశాయి.

ఈ ఏడాది సెప్టెంబర్--అక్టోబర్ నెలల్లో లిస్ట్ కావాలని చూస్తున్న మీషో, ప్రాథమిక మూలధనం ,ద్వితీయ వాటా అమ్మకాల మిశ్రమంలో దాని IPO ద్వారా రూ. 8,500 కోట్ల వరకు సేకరించే అవకాశం ఉంది.