శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్లో జీ20 టూరిజం వర్కింగ్ గ్రూపు సమావేశాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఫిల్మ్ స్టార్ రామ్ చరణ్ వెళ్లారు. అక్కడ వేదికపై జరిగిన ఓ కార్యక్రమంలో.. రామ్ చరణ్ తన నాటు నాటు స్టెప్పులతో అలరించారు. భారత్కు దక్షిణ కొరియా రాయబారి చాంగ్ జె.బోక్తో కలిసి కాలు కదిపారు. అందుకు సంబంధించిన వీడియో ప్రజంట్ నెట్టింట్ ట్రెండ్ అవుతుంది. ఆర్ఆర్ఆర్ మూవీలోని ఈ సినిమాకు ఈ ఏడాది ఉత్తమ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. నాటు నాటు ట్యూన్స్కు స్టేజ్పై ఉన్న అతిథులు కూడా రాంచరణ్తో కలిసి డ్యాన్స్ చేశారు.
ఆర్థిక పురోగతిలో ఫిల్మ్ టూరిజం పాత్ర, సాంస్కృతిక పరిరక్షణ అంశాలపై జరుగుతున్న ఈ సమావేశాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు చెర్రీ. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని రిప్రజెంట్ చేసే అరుదైన గౌరవం చరణ్కు దక్కింది. ఎంతో అద్భుతమై ప్రకృతి అందాలతో నిండి ఉండే కశ్మీర్లో ఈ కార్యక్రమం జరగడం హ్యాపీగా ఉందన్నారు చరణ్. భారతీయ సంస్కృతి ఎంతో గొప్పదని పేర్కొన్నారు.
జీ-20 సదస్సు జరుగుతున్న ఇదే ఆడిటోరియంలో.. 2016లో తాను ఓ మూవీ చిత్రీకరణలో పాల్గొన్నట్లు చెప్పారు. జపాన్ గురించి ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు రామ్ చరణ్. RRR షూటింగ్ సమయంలో ఆ దేశంలో పర్యటించామని.. అక్కడి ప్రజలు చాలా ఫ్రెండ్లీగా ఉంటారని చెప్పుకొచ్చారు. దాల్ సరస్సు ఒడ్డున ఉన్న షేర్ – ఏ – కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్లో మే 22( సోమవారం) మొదలైన ఈ సదస్సు మే 24 వరకు జరగనుంది.
https://twitter.com/ANI/status/1660605644704215042