జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి : ఎమ్మెల్యే గడ్డం వినోద్

జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి : ఎమ్మెల్యే గడ్డం వినోద్

బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి పట్టణంలోని ఏఎంసీ మైదానంలో ఆదివారం సింగరేణి సంస్థ, నోబెల్ ఎంపవర్​మెంట్​ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్​మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్ సూచించారు. శనివారం బెల్లంపల్లిలోని క్యాంప్​ఆఫీస్​లో సబ్​కలెక్టర్​ మనోజ్, మందమర్రి ఏరియా జనరల్​మేనేజర్ రాధాకృష్ణతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.

జాబ్​మేళాలో రాష్ట్రంలోని దాదాపు 70 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొంటున్నారని చెప్పారు. సుమారు 10 వేల మంది అభ్యర్థులు వస్తారని అంచనా వేస్తున్నామని, అందరికీ ఇక్కడే భోజన వసతి కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ఏఎంసీ మైదానంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఎంపవర్​మెంట్​ ప్రాజెక్టు మేనేజర్ శోభన్​బాబు,  ఎస్​వోటూ జీఎం విజయప్రసాద్, ఏసీపీ రవికుమార్, పర్సనల్​ మేనేజర్​ శ్యాంసుందర్​, సెక్యూరిటీ ఆఫీసర్​రవీందర్​పాల్గొన్నారు.