కరీంనగర్ టౌన్,వెలుగు: కరీంనగర్లోని వివేకానంద డిగ్రీ అండ్ పీజీ కాలేజిలో ఈనెల 15న శుక్రవారం ఐసీఐసీఐ బ్యాంకు సహకారంతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డా.సీహెచ్.శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. వార్షికవేతనం రూ.3.10 లక్షల నుంచి రూ.3.80లక్షల వరకు ఉంటుందని, ఈ అవకాశాన్ని డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమాచారం కోసం 9840483358, 9849737313, 9989599695 సంప్రదించాలని వెల్లడించారు.
