రాష్ట్రంలో మేఘ, బీవైడీల ఈవీ ప్లాంట్‌!

రాష్ట్రంలో మేఘ, బీవైడీల ఈవీ ప్లాంట్‌!
  • రాష్ట్రంలో మేఘ, బీవైడీల ఈవీ ప్లాంట్‌!
  • రూ. 8,000 కోట్ల పెట్టుబడి
  • సెంట్రల్​ అప్రూవల్​ కోసం అప్లికేషన్​

హైదరాబాద్​ : ఇన్​ఫ్రాస్ట్రక్చర్ రంగంలోని మేఘ ఇంజినీరింగ్​ అండ్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్స్​ లిమిటెడ్ (ఎంఈఐఎల్), చైనా ఎలక్ట్రిక్ వెహికల్స్​ తయారీ కంపెనీ బీవైడీలు కలిసి రాష్ట్రంలో ఈవీ మాన్యుఫాక్చరింగ్​, ఈవీ బ్యాటరీల తయారీ  ప్లాంట్‌ను పెట్టాలని చూస్తున్నాయి. ఈ ఫెసిలిటీ ఏర్పాటుకు రెండు కంపెనీలు కలిసి రూ. 8,000 కోట్లు (బిలియన్​ డాలర్లు) పెట్టుబడిగా పెట్టనున్నట్లు తెలుస్తోంది. ​జాయింట్​ వెంచర్ ​ కంపెనీ ఏర్పాటు  ప్రపోజల్​ ప్రభుత్వ పరిశీలనలో ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ జాయింట్​ వెంచర్ ప్రపోజల్​పై మాట్లాడేందుకు అటు ఎంఈఐఎల్, ఇటు బీవైడీ​ గ్రూప్​ల  ప్రతినిధులు అందుబాటులోకి రాలేదు. మరోవైపు  సెంట్రల్​ కామర్స్​ మినిస్ట్రీ, హెవీ ఇండస్ట్రీస్​ మినిస్ట్రీలు కూడా ఎలాంటి రిప్లై​ ఇవ్వలేదు. 

కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే పనులు ఊపందుకుంటాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. హ్యాచ్​బాక్‌ల​ నుంచి లగ్జరీ మోడల్స్​ దాకా అన్ని బీవైడీ ఎలక్ట్రిక్​ వెహికల్స్​ ను  ఇండియాలో తయారు చేయాలనేది లాంగ్​టర్మ్​ ప్లాన్ గా తెలుస్తోంది. ఎలక్ట్రిక్​ వెహికల్స్​, ప్లగ్​ ఇన్​ హైబ్రిడ్​ వెహికల్స్​ తయారీలో ప్రపంచంలోనే పెద్ద కంపెనీగా బీవైడీ పేరొందింది. గ్లోబల్​గా మూడో పెద్ద కార్ల మార్కెట్​ అయిన ఇండియాలో మాన్యుఫాక్చరింగ్​ ఫెసిలిటీ పెట్టే ప్లాన్​ ఉందని గతంలోనే కంపెనీ వెల్లడించింది. ఎంఈఐఎల్​ గ్రూప్​లోని ఒలెక్ట్రా గ్రీన్​టెక్​ లిమిటెడ్​ ఎలక్ర్టిక్​ బస్సుల తయారీ ఫెసిలిటీ ఏర్పాటు  కోసం తెలంగాణ  ప్రభుత్వం నుంచి ఇప్పటికే 150 ఎకరాల స్థలాన్ని పొందింది. 

ఫుల్లీ ఆటోమేటెడ్​ రోబోటిక్స్​ మాన్యుఫాక్చరింగ్​ పెట్టాలని ఒలెక్ట్రా ఆలోచన. ఈ ఫెసిలిటీకి ఏడాదికి 10 వేల బస్సులు తయారు చేసే కెపాసిటీ ఉండొచ్చని చెబుతున్నారు. టిప్పర్లు, ట్రక్కులు, ఎల్​సీవీలు, త్రీవీలర్లు, ఇతర ఈవీ ప్రొడక్టుల తయారీ కూడా భవిష్యత్​లో చేపట్టాలనే ప్రపోజల్​ కూడా కంపెనీకి ఉందని అంటున్నారు. తాజా జాయింట్​ వెంచర్​ ప్రపోజల్​కు కేంద్ర  ప్రభుత్వ అప్రూవల్​ వచ్చాక, కొత్త ప్రాజెక్టు కోసం స్థలంతోపాటు ఇతర సదుపాయాల కోసం  తెలంగాణ ప్రభుత్వాన్ని  కోరాలని అనుకుంటున్నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. ఎంఈఐఎల్​కి చెందిన ఒలెక్ట్రా గ్రీన్​టెక్​కు బీవైడీ ప్రస్తుతం టెక్నాలజీ పార్ట్​నర్​గా ఉంది.