నాగర్కర్నూల్, వెలుగు: రూ. 35 వేలు లంచం తీసుకుంటూ ఇన్చార్జి ఎంఈఓ, మండల రిసోర్స్కోఆర్డినేటర్(ఎమ్మార్సీ) ఏసీబీకి చిక్కారు. తాడూరు మండలం ఐతోల్ జడ్పీ హై స్కూల్ హెచ్ఎం చంద్రశేఖర్రెడ్డి తాడూరు, కొల్లాపూర్, కోడేరు,పెంట్లవెల్లి మండలాలకు ఇన్చార్జి ఎంఈఓగా చేస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్బీసీ కాలనీ ప్రైమరీ స్కూల్లో హెచ్ఎంగా చేస్తున్న ఉమాదేవి గతంలో మూడు పీఎల్ఐసీ పాలసీలు తీసుకున్నారు. వాటి మెచ్యురిటీ పీరియడ్ ముగియడంతో ఫార్వర్డ్ చేయాల్సిందిగా ఇన్చార్జి ఎంఈఓ చంద్రశేఖర్రెడ్డిని కోరారు. తనకు రూ.30 వేలు ఇస్తే ఫైల్ఫార్వర్డ్చేస్తానని ఎంఈఓ చెప్పాడు.
డబ్బులు ఇన్చార్జి ఎమ్మార్సీ చంద్రశేఖర్కు ఇవ్వాలని సూచించాడు. ఎమ్మార్సీ చంద్రశేఖర్ తనకు రూ.5 వేలు ఇస్తేనే పని చేస్తానని చెప్పడంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. బుధవారం సాయంత్రం కొల్లాపూర్ఎమ్మార్సీ బిల్డింగ్లో హెచ్ఎం ఉమాదేవి భర్త సిద్దయ్య ఎమ్మార్సీ చంద్రశేఖర్కు రూ.35 వేలు ఇచ్చి బయటకు రాగానే ఏసీబీ డీఎస్పీ కృష్ణాగౌడ్, ఆయన టీం దాడులు చేశారు. చంద్రశేఖర్ను అదుపులోకి తీసుకున్నారు.ఎంఈఓ చంద్రశేఖర్ రెడ్డిని ఏసీబీ మరో టీం బిజినేపల్లి దగ్గర అదుపులోకి తీసుకున్నారు.