
జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియాకి చెందిన లగ్జరీ విభాగం ఎంజీ సెలెక్ట్ శుక్రవారం సైబర్స్టర్ ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.72.49 లక్షలు (ప్రీ-బుకింగ్). కొత్త బుకింగ్లకు అయితే రూ.74.99 లక్షలు. ఈ కారులో 77 కిలోవాట్ అవర్ బ్యాటరీని అమర్చారు. ఫుల్ ఛార్జ్పై 580 కి.మీ. రేంజ్ ఇస్తుందని అంచనా. ఈ కారు 510 పీఎస్ పవర్, 725 ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. 3.2 సెకన్లలో 0 నుంచి -100 కి.మీ. వేగాన్ని అందుకుంటుందని కంపెనీ చెబుతోంది. సిజర్ డోర్స్, సాఫ్ట్-టాప్ రూఫ్, ట్రిపుల్ -స్క్రీన్ కాక్పిట్, బోస్ ఆడియో, లెవెల్ 2 ఏడీఏఎస్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.