రాజాపూర్ హైస్కూల్లో ‘బడి బువ్వ’ షురూ

రాజాపూర్ హైస్కూల్లో ‘బడి బువ్వ’ షురూ

కోడేరు, వెలుగు: మండలంలోని రాజాపూర్​ హైస్కూల్​లో సోమవారం నుంచి మధ్యాహ్న భోజనం ప్రారంభమైంది. శనివారం వెలుగు దినపత్రికలో ‘బడి బువ్వ లేక విద్యార్థుల తిప్పలు’ శీర్షికతో ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు.

స్కూల్  రీ ఓపెన్​ అయినప్పటికీ మధ్యాహ్న భోజనం ప్రారంభం కాకపోవడంతో విద్యార్థులు లంచ్​ బాక్సులు తెచ్చుకుంటున్నారనే విషయాన్ని ఆఫీసర్లు సీరియస్​గా తీసుకున్నారు. విషయం తెలియని కొందరు స్టూడెంట్లు లంచ్  బాక్సులు తెచ్చుకున్నారు. సీపీఎం నాయకులు ఎండీ మాలిక్, బాలయ్య స్కూల్​కు వెళ్లి స్టూడెంట్స్ తో మాట్లాడారు. ఇక నుంచి రెగ్యులర్ గా భోజనం పెడతారని తెలిపారు.