
సురక్షితంగా బయటపడ్డ పైలెట్
పనాజీ: నేవీకి చెందిన మిగ్ – 29కే యుద్ధ విమానం ఆదివారం క్రాష్ అయింది. గోవా కోస్ట్లోని అరేబియన్ సముద్రంలో ప్రమాదానికి గురైందని అధికారులు చెప్పారు. ఈ ఘటనలో పైలెట్ సేఫ్గా బయటపడ్డాడని రక్షణ శాఖ అధికారులు చెప్పారు. రోజువారి శిక్షణలో భాగంగా బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే క్రాష్ అయిందన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని, దీనిపై విచారణకు ఆదేశించామని అధికారులు చెప్పారు. ట్విన్ ఇంజిన్, సింగిల్ సీటర్ ఎయిర్క్రాఫ్ట్లో టెక్నికల్ప్రాబ్లమ్ వచ్చిందని భావిస్తున్నామన్నారు. పోయిన ఏడాది నవంబర్లో కూడా మిగ్ – 29కే ఎయిర్క్రాఫ్ట్ పక్షులు అడ్డు రావడంతో క్రాష్కు గురైంది. ఆ సమయంలో చాకచక్యంగా వ్యవహరించిన పైలెట్లు ఫ్లైట్ను జనావాసాల్లో కాకుండా ఖాళీ ప్రదేశంలో పడేలా వ్యవహరించి, వారిద్దరు కూడా తప్పించుకున్నారు.