కరోనా నుంచి కోలుకున్న మిల్కీ బ్యూటీ

కరోనా నుంచి కోలుకున్న మిల్కీ బ్యూటీ

కరోనా వైరస్‌తో ఆస్పత్రిలో చేరిన మిల్కీ బ్యూటీ తమన్నా సోమవారం డిశ్చార్జ్ అయ్యారు. ఆరు నెలలకు పైగా మూతపడ్డ షూటింగులు.. ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. దాంతో ఓ షూటింగ్‌లో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన తమన్నాకు కరోనా సోకడంతో.. నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంది. ప్రస్తుతం కరోనా నుంచి కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఆమె.. ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్వీట్ చేసింది.

‘నేనూ.. నా టీం సెట్‌లో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నాం. అయినా కూడా నాకు కరోనా ఎలా సోకిందో అర్ధం కావ‌డం లేదు. గ‌త వారం లైట్ ఫీవ‌ర్ రావడంతో కరోనా టెస్ట్ చేయించుకోగా.. పాజిటివ్ అని నిర్ధార‌ణ అయింది. దాంతో హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అడ్మిట్ అయి చికిత్స తీసుకున్నాను. నిపుణులైన వైద్యుల సంరక్షణ, డాక్టర్ల సలహాలు పాటిస్తూ ట్రీట్‌మెంట్‌ తీసుకోవడంతో కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యాను.

ప్ర‌పంచాన్ని సైతం వణికిస్తున్న క‌రోనా మ‌హమ్మారి నుంచి నేను ఇంత త్వ‌ర‌గా కోలుకోవ‌డం అదృష్టంగా భావిస్తున్నాను. త్వరలోనే పూర్తి మీ ముందుకు వ‌స్తాను. ప్రస్తుతం వైద్యుల సలహా మేరకు నేను సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నాను. నాకోసం ప్రార్థనలు చేసిన తోటి నటులు, అభిమానులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్టే సేఫ్, స్టే హెల్తీ, స్టే వెల్..’ అంటూ తమన్నా ట్వీట్ చేసింది.

For More News..

‘మోస్ట్ డేంజరస్ సెలబ్రిటీ’ జాబితాలో బాలీవుడ్ హీరోయిన్లు

రాష్ట్రంలో మరో 1,983 కరోనా కేసులు