వరదల కారణంగా చేప పిల్లల పంపిణీ ఆలస్యమైంది

వరదల కారణంగా చేప పిల్లల పంపిణీ ఆలస్యమైంది

నిర్మల్,వెలుగు: మత్స్యకారులకు ఉపాధి కల్పిస్తామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. గురువారం కలెక్టర్​ముషారఫ్​అలీ ఫారూఖీతో కలిసి ఆయన స్వర్ణ ప్రాజెక్టులో చేప పిల్లలు వదిలారు. వర్షాలు... వరదల కారణంగా చేప పిల్లల పంపిణీ ఆలస్యమైందన్నారు. జిల్లాలోని అన్ని రిజర్వాయర్లు, చెరువుల్లో చేప పిల్లల పెంపకం చేపడుతున్నట్లు వివరించారు. చేపల మార్కెటింగ్,​ ఎగుమతుల కోసం ప్రభుత్వం తరఫున సబ్సిడీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. మత్స్యకారులకు ప్రమాద బీమా కల్పించినట్లు వివరించారు. 

రైతుల సంక్షేమం కోసం పనిచేయాలి

మార్కెట్​కమిటీ పాలకవర్గాలు రైతుల సంక్షేమం కోసం పనిచేయాలని మంత్రి చెప్పారు. గురువారం నిర్మల్​మార్కెట్ కమిటీ పాలక వర్గ సమావేశానికి చీఫ్​గెస్ట్​గా హాజరయ్యారు. రైతులకు గిట్టుబాటు ధర అందాలని, దళారుల ప్రమేయం లేకుండా చూడాలని కోరారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్​చిలుక రమణ, వైస్​ చైర్మన్ శ్రీకాంత్​యాదవ్​ తదితరులు పాల్గొన్నారు. కొత్త  సచివాలయానికి అంబేద్కర్​పేరు పెట్టడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్​ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తోందన్నారు. ఢిల్లీలో నిర్మిస్తున్న కొత్త పార్లమెంట్​ భవనానికి కూడా అంబేద్కర్​ పేరు పెట్టాలని ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి డిమాండ్​  చేశారు.