వరంగల్‌లో వివాహా వేడుకకు హాజరైన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్​బాబు

వరంగల్‌లో వివాహా వేడుకకు హాజరైన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్​బాబు

కాశీబుగ్గ, వెలుగు: వరంగల్ ​తూర్పు నియోజకవర్గంలోని స్నేహితుడు రమేశ్, రజిత దంపతుల కూతురు దివ్య పెళ్లి వేడుకకు ఆదివారం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్​బాబు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

 అనంతరం గాంధీనగర్​లోని కాంగ్రెస్​ పార్టీ మాజీ ఎన్ఎస్​యూఐ నాయకుడైన పోతారపు సురేందర్, పుల్లా రమేశ్​ ఇంటికి వెళ్లి వారితో కాసేపు మాట్లాడారు. మంత్రి వెంట కాంగ్రెస్​ పార్టీ  మైనార్టీ నాయకుడు మహ్మద్​ఆయూబ్, కాంగ్రెస్​ జిల్లా ఎస్సీ సెల్​కన్వీనర్​కిన్నెర రవి, సందెల లాజర్, ఐత అరుణ్, తజముల్​ఖాన్, దినేశ్, చాంద్​పాషా, నూతన్, తదితరులున్నారు.