రాష్ట్రంలో గవర్నర్ తమిళిసై తన హూందా తనాన్ని కోల్పోతున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆమె రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలా వ్యవహరిస్తూ, ఆ పార్టీ నాయకులతో సమావేశాలు, చర్చలు జరుపుతున్నారని మండిపడ్డారు. గవర్నర్ వ్యవస్థను కించపరుస్తుండటం వల్లనే తమిళిసైకి తగిన గౌరవం దక్కడం లేదన్నారు.గవర్నర్ ను తెలంగాణ ఆడపడుచులా చూసుకున్నామని..కానీ ఆమె బీజేపీ డైరెక్షన్ లో పని చేస్తున్నారని తెలిపారు.సమస్యలపై ఆదేశాలు ఇవ్వాల్సిన గవర్నర్ రాష్ట్రాన్ని, ప్రభుత్వాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
గవర్నర్ మేడారం వచ్చే సమాచారం స్థానిక మంత్రులకు తెలియదన్నారు. తమిళిసై రాష్ట్రంలో పర్యటిస్తూ బీజేపీ నాయకులు, కార్యకర్తలను వెంటేసుకుని తిరగడం దేనికి సంకేతం అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు. ప్రభుత్వా్స్పత్రులపై గవర్నర్ ఉద్దేశపూర్వకంగానే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పేద ప్రజలకు తెలంగాణలో అందజేస్తున్న మెరుగైన వైద్యం దేశంలో ఎక్కడా లేదన్నారు. గవర్నర్ తమిళిసై తెలంగాణ రాష్ట్రాన్ని కించపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు తప్పుడు సంకేతాలిచ్చి తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. గవర్నర్ పదవికి వన్నె తెచ్చేలా తమిళిసై వ్యవహరించాలన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.