నా జీవితంలో ఏనాడూ అధికారులను నిందించలే..

నా జీవితంలో ఏనాడూ అధికారులను నిందించలే..
వరంగల్, వెలుగు: నలభై ఏండ్ల తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడూ అధికారులు, ఉద్యోగులను నిందించలేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఐనవోలు జాతర ఏర్పాట్లపై సమీక్ష సందర్భంగా తాను మాట్లాడిన మాటలను సోషల్ మీడియాలో, కొన్ని పత్రికలు, మీడియా చానళ్లలో వక్రీకరించి ప్రచారం చేశారని ఆరోపించారు. ఆ ప్రచారంలో వాస్తవం లేదని, తన మాటలను కొందరు గిట్టని వాళ్లు వక్రీకరించారని చెప్పారు. గతంలో మేడారం జాతరను దృష్టిలో పెట్టుకుని.. అధికారులు జాగ్రత్తగా, అప్రమత్తంగా పని చేయాలని మాత్రమే తాను సూచించానని పేర్కొన్నారు. తాను అధికారుల సహకారంతో అనేక అభివృద్ధి పనులు చేస్తూ ఓటమి ఎరగకుండా ఎదిగానని తెలిపారు