ప్రాజెక్టులకు కేంద్రం రూపాయి కూడా సాయం చేయలే

 ప్రాజెక్టులకు కేంద్రం రూపాయి కూడా సాయం చేయలే

తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కనీసం విభజన చట్టంలోని హామీలను కూడా అమలు చేయలేదన్నారు. రైతులను రెచ్చగొట్టి రాజకీయ లబ్దికోసం ప్రయత్నాలు మాని FCI ద్వారా బియ్యం కొంటారా..? కొనరా..? సూటిగా చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రతో ఘర్షణ పెట్టుకోవాలని లేదన్న ఎర్రబెల్లి.. బీజేపీ నాయకులు బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. నూతన రైతు బిల్లులు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయకపోవడంతోనే కక్షకట్టారన్నారు. కేంద్ర తెచ్చిన రైతు బిల్లులను బయట పెడితే..బీజేపీ పరిస్థితి దారణంగా ఉంటుందన్నారు. రేపటి నుంచి ప్రభుత్వం చేపడుతున్న ధర్నాలను రైతులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.