ప్రతి వెయ్యి ఇళ్లకు ఒక టీం

ప్రతి వెయ్యి ఇళ్లకు ఒక టీం

మెదక్ జిల్లాలలో కరోనా నియంత్రణ కోసం ప్రతి వెయ్యి ఇళ్లకు ఒక టీంను ఏర్పాటు చేశామన్నారు మంత్రి హరీశ్ రావు. జిల్లాలో 6వేల మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించామని..... ప్రస్తుతం వారి ఆరోగ్యం మెరుగుపడుతోందన్నారు. జిల్లాలో 240 ఆక్సిజన్ బెడ్లు అందూబాటులో ఉన్నాయన్నారు. ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, అధికారులతోకలిసి జిల్లాలో కరోనా పరిస్థితులపై రివ్యూ చేశారు హరీశ్ రావు. తర్వాత ఘనపూర్ మండలంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు.