బస్తీ దవాఖానాను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: హరీష్ రావు

బస్తీ దవాఖానాను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: హరీష్ రావు

సిద్దిపేట జిల్లా కేంద్రంలో బస్తీ ప్రజల సుస్తీ నయం చేయడానికే బస్తీ దవాఖాన ఏర్పాటు చేసి అందుబాటులోకి తెచ్చామని మంత్రి హరీష్‭రావు అన్నారు. పట్టణంలోని 11వ వార్డు కాళ్లకుంట కాలనీలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను ఆయన ప్రారంభించారు. కాళ్లకుంట కాలనీ బస్తీ దవాఖానలో అన్ని రకాల సౌకర్యాలు, మందులు అందుబాటులో ఉన్నాయని హరీష్ చెప్పారు. ఈ బస్తీ దవాఖానను ఈ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

రాబోయే రోజుల్లో సిద్ధిపేటలో1000 పడకల ఆసుపత్రి అందుబాటులోకి రానున్నదని హరీష్‭రావు చెప్పారు. రాబోయే రోజుల్లో గుండె, క్యాన్సర్, కిడ్నీలాంటి వ్యాధులకు ఉచితంగా వైద్యం అందిస్తామన్నారు. పేదల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. కరోనా తర్వాత  ప్రతి మనిషికి 10 కిలోల బియ్యాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తోందని చెప్పారు. ఇక సంక్రాంతి పండుగ తరువాత ఇంటి అడుగుజాగలో ఇళ్లు కట్టుకునే వారికి 3 లక్షలు ఆర్థిక సాయం అందిస్తామని హరీష్ రావు హామీ ఇచ్చారు.