ఆరు గ్యారంటీ పథకాలతో పేదలకు న్యాయం : జూపల్లి కృష్ణారావు

ఆరు గ్యారంటీ పథకాలతో పేదలకు న్యాయం : జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్,​ వెలుగు : కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సోనియమ్మ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఆదివారం మండలంలోని మాచినేనిపల్లిలో గడపగడపకు కాంగ్రెస్​ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కర్నాటక రాష్ట్రానికి చెందిన ఇద్దరు పరిశీలకుల సమక్షంలో గ్రామ యువకులు బీఆర్ఎస్​ పార్టీ నుంచి కాంగ్రెస్​లో చేరారు. అంతకుముందు గ్రామంలో కాంగ్రెస్​పార్టీ జెండాను ఆవిష్కరించారు.

కాంగ్రెస్ పథకాలపై ప్రచారం

నాగర్ కర్నూల్ టౌన్ : ఇంటింటికీ కాంగ్రెస్  పథకాలపై నియోజకవర్గ నేత కూచుకూళ్ల రాజేశ్​రెడ్డి ప్రచారం చేశారు. తాడూరు మండలం గుట్టలపల్లి, పొలమూరు గ్రామాల్లో ప్రజా చైతన్యయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్  పార్టీ అధికారంలోకి రాగానే సోనియాగాంధీ ప్రకటించిన స్కీములు అమలు చేస్తామని చెప్పారు. పీసీసీ సభ్యుడు వల్లభ రెడ్డి, జడ్పీటీసీలు రోహిణి, సుమిత్ర, శ్రీనివాస్ రెడ్డి, హబీబ్  పాల్గొన్నారు.

పోస్టర్ల రిలీజ్..

బాలానగర్ : సోనియాగాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీమ్​ పోస్టర్లను పార్టీ నాయకులతో కలిసి ఆదివారం టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనంపల్లి అనిరుధ్​రెడ్డి రిలీజ్​ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జడ్చర్ల నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో గ్యారంటీ స్కీమ్​ను గడపగడపకు వెళ్లి ప్రజలకు వివరిస్తానని తెలిపారు.