హైదరాబాద్, వెలుగు : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలు కేవలం హిందీ, ఇంగ్లిష్మీడియంలోనే నిర్వహించాలన్న నిర్ణయాన్ని సవరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్నిమంత్రి కేటీఆర్ కోరారు. సీఆర్పీఎఫ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో పరీక్ష కేవలం రెండు మీడియంలలోనే నిర్వహిస్తామని పేర్కొన్నారని, దానిలో సవరణలు చేయాలని కోరుతూ కేంద్ర హోంమంత్రి అమిత్షాకు శుక్రవారం ఆయన లేఖ రాశారు. తెలుగుతో పాటు గుర్తించిన అన్ని అధికారిక భాషల్లోనూ ఈ పరీక్ష నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. హిందీ, ఇంగ్లిష్ భాషల్లోనే పోటీ పరీక్షలు నిర్వహిస్తుండటంతో ఆయా మీడియంలలో చదువుకోని యువతకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని తెలిపారు.
దేశంలో గుర్తించిన 12 అధికారిక భాషల్లో నేషనల్రిక్రూట్మెంట్ఏజెన్సీలు కామన్ఎలిజిబులిటీ టెస్ట్నిర్వహించాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నాయని, కానీ ఆ నిర్ణయం పూర్తిగా అమలు కావడం లేదని తెలిపారు. సీఆర్పీఎఫ్నోటిఫికేషన్ఇందుకు నిదర్శనమన్నారు. దేశంలో గుర్తించిన అధికారిక భాషలు ఎన్నో ఉన్నా కేవలం రెండు భాషల్లోనే రిక్రూట్మెంట్పరీక్షలు నిర్వహించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల వాళ్లు సమాన అవకాశాలు పొందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.