తెలంగాణలో తయారైన మెడికల్ డివైజ్‌‌‌‌‌‌‌‌లొచ్చినయ్‌‌‌‌‌‌‌‌

తెలంగాణలో తయారైన మెడికల్ డివైజ్‌‌‌‌‌‌‌‌లొచ్చినయ్‌‌‌‌‌‌‌‌
  • మెడికల్ డివైజ్ పార్క్‌‌‌‌‌‌‌‌లో ఇన్నోవేటివ్ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లను లాంచ్‌‌‌‌‌‌‌‌ చేసిన కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: తెలంగాణలో  తయారైన కొన్ని ఇన్నోవేటివ్ మెడికల్ డివైజ్‌‌‌‌‌‌‌‌లను మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాంచ్ చేశారు. హువెల్‌‌‌‌‌‌‌‌ లైఫ్‌‌‌‌‌‌‌‌సైన్సెస్‌‌‌‌‌‌‌‌, ఈఎంపీఈ డయాగ్నొస్టిక్స్‌‌‌‌‌‌‌‌, బ్లూ సెమీ వంటి ఇండియన్‌‌‌‌‌‌‌‌ కంపెనీలు డెవలప్ చేసిన, వరల్డ్‌‌‌‌‌‌‌‌ క్లాస్ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లను మెడికల్ డివైజ్ పార్క్‌‌‌‌‌‌‌‌లో  లాంచ్ చేశారు.  మెడ్‌‌‌‌‌‌‌‌టెక్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అన్ని విధాల సపోర్ట్‌‌‌‌‌‌‌‌ ఇస్తున్నామని, వరల్డ్‌‌‌‌‌‌‌‌ క్లాస్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందిస్తూ  మెడికల్ డివైజ్‌‌‌‌‌‌‌‌ కంపెనీలను ప్రోత్సహిస్తున్నామని ట్విట్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్నారు.  తెలంగాణ, ప్రపంచం కోసం తెలంగాణలో తయారైన వరల్డ్‌‌‌‌‌‌‌‌ క్లాస్ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లను లాంచ్ చేయడం  గర్వంగా ఉందని పేర్కొన్నారు. 

హువెల్ లైఫ్‌‌‌‌‌‌‌‌సైన్సెస్‌‌‌‌‌‌‌‌..

వివిధ రకాల ఇన్‌‌‌‌‌‌‌‌ఫెక్షన్‌‌‌‌‌‌‌‌ల కోసం  న్యూక్లిక్‌‌‌‌‌‌‌‌ యాసిడ్ టెస్టింగ్ చేయడానికి  హువెల్‌‌‌‌‌‌‌‌ లైఫ్‌‌‌‌‌‌‌‌సైన్సెస్‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌ చేసిన   మాలుక్యులర్ డివైజ్‌‌‌‌‌‌‌‌ హువెల్‌‌‌‌‌‌‌‌ యూనియాంప్‌‌‌‌‌‌‌‌ను కేటీఆర్ లాంచ్ చేశారు. టెస్ట్ రిజల్ట్స్‌‌‌‌‌‌‌‌ను  ఏడు నిమిషాల్లోనే తెలుసుకోవచ్చని ట్విట్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్నారు.  హెమోగ్లోబిన్ టెస్టింగ్ కోసం హెమోమెజర్‌‌‌‌‌‌‌‌, ఫెర్రిన్‌‌‌‌‌‌‌‌ టెస్ట్ కోసం  ఫెర్రిక్వాంట్‌‌‌‌‌‌‌‌ డివైజ్‌‌‌‌‌‌‌‌లను లాంచ్ చేశారు. సుమారు 20 కి పైగా డయాగ్నొస్టిక్స్‌‌‌‌‌‌‌‌ కిట్లను, డివైజ్‌‌‌‌‌‌‌‌లను తయారు చేయడానికి హువెల్‌‌‌‌‌‌‌‌ లైఫ్‌‌‌‌‌‌‌‌సైన్సెస్‌‌‌‌‌‌‌‌కు లైసెన్స్‌‌‌‌‌‌‌‌లు ఉన్నాయి. కరోనా టైమ్‌‌‌‌‌‌‌‌లో ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీపీసీఆర్ కిట్లను ఎక్కువగా సప్లయ్ చేసిన కంపెనీ కూడా ఇదే కావడం విశేషం. ఈ కంపెనీ సుమారు 25 రాష్ట్రాలకు 5.4  కోట్ల కిట్లను సప్లయ్ చేసింది.  

ఈఎంపీఈ డయాగ్నొస్టిక్స్‌‌‌‌‌‌‌‌..

టీబీ గుర్తించడానికి వాడే  టెస్ట్‌‌‌‌‌‌‌‌ కిట్‌‌‌‌‌‌‌‌ మ్లోడీఎక్స్‌‌‌‌‌‌‌‌టీఎం  ఎండీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా కేటీఆర్ లాంచ్ చేశారు. ప్రపంచంలో ఇలాంటి  మెడికల్ కిట్ రావడం ఇదే మొదటిసారని,  మాలుక్యులర్ లెవెల్‌‌‌‌‌‌‌‌లో పనిచేసే బయోసెన్సర్లు ఈ కిట్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయని ట్వీట్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఈ కిట్‌‌‌‌‌‌‌‌ బాడీలోని టీబీ బ్యాక్టరీయా ఉందో? లేదో? గుర్తిస్తుందని, యాంటిబయోటిక్ రెసిస్టెన్స్‌‌‌‌‌‌‌‌లను సరిగ్గా గుర్తిస్తుందని వివరించారు. ఈ టెస్ట్‌‌‌‌‌‌‌‌ రిజల్ట్స్‌‌‌‌‌‌‌‌ 3 గంటల్లోనే వస్తాయని అన్నారు. రాష్ట్రంలోని జెనోమ్‌‌‌‌‌‌‌‌ వ్యాలీలో ఈ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌ తయారు కావడం మనకు గర్వకారణమని పేర్కొన్నారు. కాగా, జెనోమ్ వ్యాలీలోని తమ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్ డీ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విస్తరించడానికి ఈఎంపీఈ డయాగ్నోస్టిక్స్‌‌‌‌‌‌‌‌  మరో రూ.25 కోట్లను ఖర్చు చేయాలని నిర్ణయించుకుంది. 

బ్లూసెమీ..

టీహబ్‌‌‌‌‌‌‌‌ నుంచి వచ్చిన బ్లూసెమీ  ఈయ్వా పేరుతో ఓ మెడికల్ డివైజ్‌‌‌‌‌‌‌‌ను లాంచ్ చేసింది. ఈ డివైజ్‌‌‌‌‌‌‌‌తో ఆరు రకాల  టెస్ట్‌‌‌‌‌‌‌‌లను నిమిషంలోనే పూర్తి చేసుకోవచ్చు.

రైట్‌‌‌‌‌‌‌‌ సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌..

యూఎస్ కంపెనీ రైట్ సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్ సొల్యూషన్స్ అండ్ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో తమ సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేసింది. మినిస్టర్ కేటీఆర్ ఈ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించారు. రానున్న మూడేళ్లలో రైట్‌‌‌‌‌‌‌‌ సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్ రాష్ట్రంలో రూ.100 కోట్లను ఇన్వెస్ట్ చేస్తుందని,  వెయ్యి మంది ఐటీ  ప్రొఫెషనల్స్‌‌‌‌‌‌‌‌కు జాబ్స్ ఇస్తుందని అంచనా.