మంత్రి కేటీఆర్ మహబూబ్ నగర్ టూర్ .. షెడ్యూల్ ఇదే

మంత్రి  కేటీఆర్ మహబూబ్ నగర్ టూర్ ..  షెడ్యూల్ ఇదే

మంత్రి కేటీఆర్ 2023 జూన్ 8 గురువారం రోజున మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులోభాగంగా పలు అభివృద్ధి కార్యక్రామలలో పాల్గొననున్నారు. ఉదయం 10:30 గంటలకు మూసాపేట మండలం వేములలో కోజెంట్ పరిశ్రమ నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు.  అనంతరం 11:30 గంటలకు మహబూబ్ నగర్ చేరుకుని అక్కడ ఏర్పాటు చేయనున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కు భూమి పూజ చేస్తారు.

అక్కడి నుండి పద్మావతి కాలనీకి చేరుకొని అయ్యప్ప గుట్ట సమీపంలో నిర్మించిన ఆధునిక వైకుంఠ దామాన్ని ప్రారంభిస్తారు. ఆతరువాత మధ్యాహ్నం 1:45 గంటలకు జడ్చర్లలో రాష్ట్ర సర్కార్ నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తారు.