
కూసుమంచి, వెలుగు: రాష్ట్రంలోని నిరుపేదలకు వైద్య సహాయం కోసం సీఎంఆర్ఎఫ్ కింద ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డ ఏడాదిలో రూ.1,070 కోట్ల ఆర్థికసహాయం అందించామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. బుధవారం కూసుమంచి క్యాంపు ఆఫీస్లో 71 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ కింద రూ.23.33లక్షలు, 35 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు ఆయన చెక్కులు పంపిణీ చేశారు.
కూసుమంచి మండలం ముత్యాలగూడెం గ్రామానికి చెందిన తాటికొండ రామారావు ఇటీవల కరెంటు షాక్తో చనిపోగా విద్యుత్ శాఖ నుంచి ఎక్స్గ్రేషియా చెక్కును మృతుడి తండ్రికి అందజేశారు.