
కోహెడ, వెలుగు: ధాన్యం తరలించేందుకు ట్రాన్స్పోర్ట్ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి పొన్నం ప్రభాకర్అధికారులను ఆదేశించారు. రైతులకు ధాన్యం పేమెంట్వెంటనే పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. శనివారం మండలంలోని శనిగరం ఐకేపీ సెంటర్ నుకలెక్టర్ మనుచౌదరితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లడుతూ.. అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా టార్ఫాలిన్కవర్లను అందించాలన్నారు. శనిగరం ప్రాజెక్టు కాల్వలో పూడిక తీయాలని ఇరిగేషన్అధికారులకు సూచించారు.
మహిళా సంఘాలు రైస్మిల్లులు ఇవ్వాలని కోరుతున్నారని దానిపై పరిశీలన చేస్తున్నామన్నారు. వంటిమామిడి దగ్గర ఉన్న వెజిటబుల్ మార్కెట్ మాదిరిగాశనిగరం వద్ద చేపల మార్కెట్ను ఏర్పాటు చేసి ఫిషరీస్సంఘాలు ఇక్కడే చేపలు అమ్ముకునేలా చేస్తామన్నారు. మండలంలో రూ,180కోట్లతో నిర్మించే యంగ్ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్కూల్కు టెండర్ ప్రక్రియ పూర్తయిందని పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్కలెక్టర్హమీద్, డీపీఎం కరుణాకర్, డీఆర్డీవో జయదేవ్, ఆర్డీవో రామ్మూర్తి, ఏఎంసీ చైర్పర్సన్నిర్మల, వైస్చైర్మన్తిరుపతిరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు ధర్మయ్య, నాయకులు సుధాకర్, రవీందర్, శ్రీధర్, ప్రతాప్రెడ్డి, అనిల్, వెంకటస్వామి పాల్గొన్నారు.
ఎల్లమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి
ఈ నెల12 నుంచి నెల రోజుల పాటు జరిగే రేణుక ఎల్లమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్అధికారులను ఆదేశించారు. హుస్నాబాద్లో ఎల్లమ్మ ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ ఎల్లమ్మ ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారన్నారు. అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. జూబ్లీహిల్స్పెద్దమ్మ, బల్కంపేట ఎల్లమ్మ ఆలయాల మాదిరి ఇక్కడ కూడా అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలోనే ఆలయ కమిటీని నియమిస్తామని తెలిపారు. ఆయన వెంట జిల్లా లైబ్రరీ చైర్మన్ లింగమూర్తి, ఆలయ ఈవో కిషన్రావు, సింగిల్విండో చైర్మన్శివ్వయ్య, ఆర్డీవో రామ్మూర్తి ఉన్నారు.