ఒక్కరోజే 1.12 లక్షల మంది టీచర్ల అకౌంట్లోకి రూ. 2 వేలు

ఒక్కరోజే 1.12 లక్షల మంది టీచర్ల అకౌంట్లోకి రూ. 2 వేలు

దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రైవేటు టీచర్లకు ఆర్థిక సాయంతో పాటు రేషన్ ఇస్తున్న ప్రభుత్వం  టీఆర్ ఎస్సేనని  అన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రాజేంద్ర నగర్ పరిధిలోని అత్తాపూర్ లో ప్రైవేటు టీచర్లకు రేషన్ బియ్యం కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఒక లక్షా 24వేల మందికి 25కిలోల రేషన్ బియ్యం ఇవ్వబోతున్నట్లు తెలిపారు. నిన్న ఒక్కరోజే లక్షా 12 వేల మంది టీచర్ల అకౌంట్లోకి 2వేల రూపాయల నగదు వేశామన్నారు.