ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి :మంత్రి సీతక్క

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి :మంత్రి సీతక్క
  • పంచాయతీరాజ్​శాఖ మంత్రి సీతక్క

ఆదిలాబాద్ ​టౌన్, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క పార్టీ శ్రేణులకు సూచించారు. మహారాష్ర్టలోని వార్దాలో గల సేవాగ్రామ్​ సందర్శనకు వెళ్తూ శ‌నివారం ఆదిలాబాద్ కు వచ్చిన ఆమె నియోజకవర్గ ఇన్​చార్జి​ కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రిని పార్టీ నాయకులు సన్మానం చేశారు. 

అనంతరం మంత్రికి పోలీసుల గౌర‌వ వంద‌నం చేశారు. జిల్లా రాజ‌కీయాలు, ప్రభుత్వ సంక్షేమ ప‌థ‌కాల అమలు గురించి చర్చించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నిక‌లు త‌దిత‌ర విష‌యాల‌పై సమీక్షించారు. మంత్రి వెంట సేవాగ్రామ్​కు కంది శ్రీనివాసరెడ్డి, జీసీసీ చైర్మన్ కొట్నాక తిరుప‌తి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ‌, డీఎస్పీ జీవ‌న్ రెడ్డి, నాయ‌కులు లోక ప్రవీణ్​రెడ్డి, గిమ్మ సంతోశ్, రావుల సోమ‌న్న యాద‌వ్ త‌దిత‌రులు  ఉన్నారు.