హైదరాబాద్​లో​ ప్రావిడెన్స్​ ఆఫీసు ప్రారంభించిన మంత్రి శ్రీధర్​బాబు

హైదరాబాద్​లో​ ప్రావిడెన్స్​ ఆఫీసు ప్రారంభించిన మంత్రి శ్రీధర్​బాబు

హైదరాబాద్, వెలుగు: గ్లోబల్ హెల్త్‌‌‌‌కేర్ ఇంజనీరింగ్ సెంటర్​ కోసం కొత్త ఆఫీసును ప్రావిడెన్స్ ఇండియా అందుబాటులోకి తెచ్చింది. చీఫ్​గెస్టుగా వచ్చిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి  శ్రీధర్ బాబు దీనిని ప్రారంభించారు. పెరుగుతున్న డిమాండ్‌‌‌‌ను తీర్చడానికి హైదరాబాద్‌‌‌‌లోని తన ఆఫీసులో ఉద్యోగుల సంఖ్యను నాలుగు వేలకు పెంచుతామని ప్రకటించింది.  

క్లౌడ్, సైబర్‌‌‌‌ సెక్యూరిటీ, క్లినికల్ అప్లికేషన్స్​,  డిజిటల్ సొల్యూషన్స్, డేటా  అడ్వాన్స్‌‌‌‌డ్ అనలిటిక్స్, ప్రొడక్ట్ డెవలప్‌‌‌‌మెంట్, ప్రాసెస్ ఆటోమేషన్, డిజిటల్ ఆపరేషన్స్, ఎంటర్‌‌‌‌ప్రైజ్ సర్వీసెస్, జెన్​ఏఐ వంటి ఎమర్జింగ్ టెక్నాలజీలతో సహా కీలకమైన ఫంక్షన్‌‌‌‌లకు సెంట్రల్ హబ్‌‌‌‌గా పనిచేయడానికి కొత్త సదుపాయాన్ని ప్రారంభించామని ప్రావిడెన్స్​ పేర్కొంది.