ప్రాంతీయ పార్టీలను ఎదగనీయడం లేదు

ప్రాంతీయ పార్టీలను ఎదగనీయడం లేదు

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు : ప్రాంతీయ పార్టీలను బీజేపీ, కాంగ్రెస్​ పార్టీలు ఎదగనీయడం లేదని మంత్రి శ్రీనివాస్​గౌడ్​ విమర్శించారు.  గురువారం తన క్యాంప్​ ఆఫీస్​లో మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ది కుటుంబ పాలన అంటున్నారని, తాత ముత్తాల నుంచి కాంగ్రెస్​ నేతలు చేస్తుంది ఏమిటని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ రాసిచ్చిన స్క్రిప్ట్  చదువుతాడని, చివరకు అభాసుపాలవుతారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఏ యాత్ర చేసినా మధ్యలోనే వదిలేస్తాడని, అది ఆయన మనస్తత్వమని పేర్కొన్నారు.

దేశ్యాప్తంగా బీఆర్ఎస్  పార్టీ బలంగా మారుతుంటే ఓర్వలేక కాంగ్రెస్  పార్టీ కుట్రలు చేస్తుందన్నారు. కాంగ్రెస్  పార్టీ చేస్తున్న దొంగ సర్వేలను ప్రజలు నమ్మరని పేర్కొన్నారు. మూడోసారి బీఆర్ఎస్  విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్  చైర్మన్  కేసీ నర్సింలు, ముడా చైర్మన్  వెంకన్న, లైబ్రరీ చైర్మన్  రాజేశ్వర్ గౌడ్  పాల్గొన్నారు.