శ్రీజను అభినందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

శ్రీజను అభినందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఆకుల శ్రీజకు ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని రాష్ట్ర క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కామన్వెల్త్ గేమ్స్ 2022 లో టేబుల్ టెన్నిస్ పోటీల్లో బంగారు పతకం సాధించిన శ్రీజ.. ఇవాళ ఢిల్లీ నుండి హైదరాబాద్ కు చేరుకుంది. ఈ క్రమంలో ఆమెకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో మంత్రి శ్రీనివాస్ గౌడ్, శ్రీజ కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ నుండి టేబుల్ టెన్నిస్ లో గోల్డ్ మెడల్ సాధించడం గొప్ప వరమని శ్రీజను అభినందించారు. త్వరలోనే శ్రీజను ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు తీసుకెళ్లి సన్మానం చేయిస్తానని తెలిపారు. తెలంగాణ నుంచి శ్రీజకు అందాల్సిన సహకారాన్ని ప్రభుత్వం తరఫున అందజేసేందుకు కృషి చేస్తామని మంత్రి చెప్పారు.

అనంతరం శ్రీజ ఆకుల మాట్లాడుతూ.. ఈ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించడం నాకు గొప్ప అనుభూతి అని శ్రీజ తెలిపింది. ఒలంపిక్స్ లో మెడల్స్ సాధించడమే నా లక్ష్యంగా ముందుకు కొనసాగుతనని..ఇందుకు ప్రభుత్వం కూడా సహకరించాలని ఆమె కోరింది.