సాయి తేజ్‎పై అసత్య ప్రచారాలు చేయొద్దు

సాయి తేజ్‎పై అసత్య ప్రచారాలు చేయొద్దు

హైదరాబాద్: హీరో సాయి ధరమ్ తేజ్ మీద అసత్య ప్రచారాలు చేయొద్దని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సాయి తేజ్ శుక్రవారం మాదాపూర్ లో బైకు మీద నుంచి పడిన విషయం తెలిసిందే. అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ సాయి తేజ్ ని పరామర్శించిన తలసాని.. సాయి తేజ్ మీద తప్పుడు ప్రచారాలు చేయొద్దన్నారు. ‘వినాయకుడి దయ వల్ల తేజ్ కి ఏం కాలేదు. చిన్న చిన్న గాయాలు మాత్రమే అయ్యాయి. హెల్మెట్, షూస్, జాకెట్ వేసుకోవడం వల్ల ఏం కాలేదు. వైద్యులు ఎప్పటికప్పుడు ఆయనకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. సాయి తేజ్ ప్రస్తుతం స్పృహలోనే ఉన్నారు’ అని తలసాని అన్నారు.