ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం : ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం : ఉత్తమ్ కుమార్ రెడ్డి
  •  ఉమ్మడి జిల్లా సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
  •  జిల్లా ఇన్‌‌‌‌‌‌చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 
  •  వివిధ ప్రభుత్వ పథకాల పురోగతిపై నాలుగు జిల్లాల కలెక్టర్లతో మీటిం

కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని రాష్ట్ర ఇరిగేషన్, సివిల్ సప్లై, జిల్లా ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. సంక్షేమ పథకాలకు జిల్లా కలెక్టర్లు పూర్తి బాధ్యత వహించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆదేశించారు. అనర్హులకు అందిస్తే  అధికారులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరించారు.  కరీంనగర్ ఉమ్మడి జిల్లా సమగ్ర అభివృద్ధికి మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబుతో కలిసి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు  తెలిపారు.  

ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, ధాన్యం కొనుగోళ్లు, వానాకాలం పంటల సాగు సన్నద్ధతపై కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ లోని ఆడిటోరియంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి మంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉమ్మడి జిల్లా కలెక్టర్లు ఉన్నతాధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ సమావేశంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి దుదిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, రామగుండం ఎమ్మెల్యే ఠాకూర్ మక్కాన్ సింగ్, ఎమ్మెల్సీలు చిన్నమైలు అంజిరెడ్డి, మల్కా కొమరయ్య, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విప్ అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సమావేశానికి గైర్హాజరయ్యారు. విదేశీ పర్యటన కారణంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. 

కాల్వలు, తూముల రిపేర్లకు నిధులు

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ  ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కాల్వలు, తూములు, ఓటి రిపేర్లకు నిధులిస్తామని, త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సింగరేణి భూముల  సమస్య పరిష్కరిస్తామని, బండ్ల వాగు ఎత్తిపోతల పథకాన్ని వారం రోజుల్లో ప్రారంభిస్తామని, పాలకుర్తి లిఫ్ట్,  పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణ పనులకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. రోళ్ల వాగు ప్రాజెక్టుకు అటవీ అనుమతులు వచ్చేలా జగిత్యాల కలెక్టర్ ప్రత్యేకంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. నారాయణపురం రిజర్వాయర్, కొండగట్టు ఎత్తిపోతల పథకం, కలికోట సూరమ్మ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రైస్ మిల్లుల దగ్గర ఎక్కడైనా వడ్లు కటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెడితే చర్యలు తీసుకోవాలన్నారు. 

తక్కువ ఖర్చుతో 43,100  ఎకరాలకు పైగా ఆయకట్టుకు కలికోట సూరమ్మ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందుతుందని, దీనికి ప్రభుత్వం రూ.320 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు.   చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ నారాయణపురం రిజర్వాయర్ పనులు 90 శాతం పూర్తి చేశామని, భూ సేకరణ కోసం రూ.23 కోట్లు, ప్రాజెక్టు పూర్తి కావడానికి మరో రూ.20 కోట్లు విడుదల చేస్తే  పనులు పూర్తవుతాయన్నారు. కొండగట్టు ఎత్తిపోతల పథకం పూర్తికి రూ.22 కోట్ల విడుదల చేయాలని కోరారు.  సమావేశంలో జిల్లా లైబ్రరీ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఉమ్మడి జిల్లా కలెక్టర్లు పమేలా సత్పతి, సందీప్ కుమార్ ఝ, సత్యప్రసాద్, పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్ జె.అరుణ, వివిధ శాఖల ఉన్నతాధికారులు అధికారులు పాల్గొన్నారు.

ఇండ్ల స్థలాల సమస్యపై జర్నలిస్టుల వినతి 

కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వర్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్య పరిష్కరించాలని కోరుతూ టీయూడబ్ల్యూజే, తెలంగాణ యూనియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జర్నలిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 143) ఆధ్వర్యంలో మంత్రి ఉత్తమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డికి జర్నలిస్టులు వినతిపత్రం అంజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సారెస్పీ సమీపంలో అందుబాటులో ఉన్న భూముల పంపిణీకి అడ్డంకిగా ఉన్న సమస్యలు పరిష్కరించి త్వరలోనే ఇంటి పట్టాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. 

రాజన్న కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మంత్రుల అభినందన 

రాజన్న సిరిసిల్ల, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీలో రాజన్న సిరిసిల్ల జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జిల్లా అధికారులను మంత్రులు అభినందించారు. జిల్లాకు 7862 ఇండ్లు మంజూరు కాగా.. ఇప్పటివరకు 7808 శాంక్షన్‌‌‌‌‌‌‌‌ ఆర్డర్లు లబ్ధిదారులకు అందజేశారు. వేములవాడ నియోజకవర్గంలో ఫేజ్-1,2 లో కలిపి 2,575 ఇండ్లు, సిరిసిల్ల నియోజకవర్గంలో 3,608 ఇండ్లు, బోయినపల్లి మండలంలో 820, ఇల్లంతకుంట మండలంలో 42 ఇండ్లకు మంజూరు పత్రాలు జారీ చేశారు. 

తరుగు దోపిడీ లేకుండా చేశాం మంత్రి పొన్నం 

రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గత పాలకుల హయాంలో రైస్ మిల్లుల వద్ద తరుగు, తూకం పేరుతో రైతులు దోపిడీకి గురయ్యారని, ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ఎక్కడ  ఇబ్బంది రాలేదన్నారు.  కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోకి భూపాలపల్లి, హనుమకొండ, సిద్దిపేట జిల్లాలోని కొన్ని మండలాలు వస్తాయని ఆయా జిల్లా కలెక్టర్లను సైతం ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశాలకు ఆహ్వానించాలని సూచించారు. కరీంనగర్ హుస్నాబాద్ నియోజకవర్గంలో గత ప్రభుత్వం ఇండ్ల నిర్మాణంలో నిర్లక్ష్యం వహించిందని గుర్తు చేశారు. 

కాంగ్రెస్ అంటేనే రైతులకు ధైర్యం: మంత్రి శ్రీధర్ బాబు 

మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతులకు ఒక ధైర్యమని, రైతులు ఆత్మస్థైర్యం కోల్పోకుండా కలెక్టర్లు చూడాలని ఆదేశించారు. ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పామని, చెప్పినట్లే భూభారతి చట్టం తీసుకొచ్చామని తెలిపారు. జూన్ 2 నుంచి భూభారతి అమలులోకి వస్తుందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో అవకతవకలు జరుగకుండా కలెక్టర్లే దృష్టిపెట్టాలని సూచించారు.