ప్రజలే మా ధైర్యం.. ప్రజలే మా ఆస్తి.. మీ నమ్మకాన్ని నిలబెడ్తా : మంత్రి వివేక్ వెంకటస్వామి

 ప్రజలే మా ధైర్యం.. ప్రజలే మా ఆస్తి.. మీ నమ్మకాన్ని నిలబెడ్తా :  మంత్రి వివేక్ వెంకటస్వామి

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా చెన్నూరు నియోజకవర్గానికి వచ్చిన  వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం లభించింది.  బాణాసంచా కాల్చి గుస్సాడి నృత్యాలతో ఘనంగా స్వాగతం పలికారు  చెన్నూరు కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు.  డీజే సప్పుళ్లు, బ్యాండ్ బాజా, డ్యాన్సులతో భారీ గజమాలతో సత్కరించారు.  చెన్నూర్ పట్టణంలోని పాత బస్ స్టాండ్ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. 

ఈ సందర్బంగా మాట్లాడిన మంత్రి  వివేక్ వెంకస్వామి.. మా నాన్న  మొదటి సారిగా ఎమ్మెల్యే అయింది చెన్నూర్ నుంచే.  నేను ఎమ్మెల్యేగా గెలిచింది ఇక్కడ నుంచే.  మీ ప్రేమ అభిమానాలు ఇలాగే ఉండాలి.  ప్రజల ప్రేమే కావాలి పదవులు కాదని కాక వెంకటస్వామి మాకు నేర్పించారు.  మేము పదవుల కోసం ఏనాడు తాపత్రయ పడలేదు.. పదవులే మా కుటుంబం దగ్గరికి వచ్చాయి. పదవుల కోసం మేము ఎప్పుడూ ఎక్కడికి పోలేదు. ప్రజలే మా ధైర్యం ప్రజలే మా ఆస్తి.

 చెన్నూరు నుంచి ఎవరు ఎప్పుడూ వచ్చిన రాత్రి పగలు అని లేకుండా పని చేస్తున్న. ఎంపీ ఎన్నికల సమయంలో చాలా మంది పోటీ పడ్డారు కానీ వంశీ కృష్ణకే అవకాశం దక్కింది. ప్రజల ప్రేమనే గడ్డం కుటుంబం ఆస్తి.  మీరందరూ ఇంత ప్రేమతో మమ్మల్ని ఆదరించడం చాలా ఆనందంగా ఉంది. తెలంగాణా ఉంద్యమంలో మా నాన్నా  లాగ నేను కూడా ఉద్యమం చేశా.  ఉద్యమ సమయంలో కేంద్రంలో తెలంగాణా విశిష్టతను వివరించాం. అప్పటి ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి చెంప దెబ్బ కొట్టేలాగా మేము ఉద్యమంలో పాల్గొన్నాము.  అప్పుడు చాలా ఒత్తిళ్లు ఉన్నా కానీ నన్ను గెలిపించుకున్నారు.  మీరు నా మీద ఉంచుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను.  

ఊర్లలో వెళ్ళడానికి చాలా చోట్ల రోడ్లు లేకుండే నేను అన్ని చోట్ల సీసీ రోడ్లు వేయించా.  మన ప్రాంతంలో నీళ్లకు కరువు ఉండకూడదని అమృత్ 2.0 ద్వారా నీటిని అందిస్తున్నా.. చెన్నూర్ నియోజకవర్గ ప్రజలకు నేను నిరంతరం సేవా చేస్తుంటాను.  ప్రజలకు ఏది అవసరమో అన్ని సౌకర్యాలు కల్పిస్తాను.  నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రతీ గ్రామానికి 50 లక్షల నిధులు మంజూరు  చేశా. వచ్చే సంవత్సరంలో శ్మశాన వాటికలకు రోడ్లు వేస్తానని హామీ ఇస్తున్నాను

కాళేశ్వరం ప్రాజెక్ట్ కేవలం కమీషన్ ల కోసమే కట్టారు. 2 సంవత్సరాలుగా కాళేశ్వరం నీళ్లు రాకున్నా పంటలు ఎక్కువగా పండాయి.  కేటీఆర్ వాస్తవాలు మాట్లాడకుండా ఎక్కడో ఏదో జరుగుతుందని మాట్లాడుతున్నాడు.  కాకా వెంకటస్వామి  తుమ్మిడి హట్టి దగ్గర  కట్టడానికి చూశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కాంట్రాక్టర్లు ధనవంతులు అయ్యారు.  తెలంగాణా రాష్ట్రాన్ని కేసీఆర్  అప్పుల కుప్పగా చేశారు.

చెన్నూరులో  ఇసుక మాఫియా జరుగుతుందని నాకు చెప్పారు... నేను గెలిచిన వెంటనే ఇసుక మాఫియా లేకుండా చేశాను.  చెన్నూరులో ఇసుక మాఫియా బంద్ చేసినట్లు రాష్ట్రంలో కూడా చేయాలని రేవంత్ రెడ్డి నాకు మైనింగ్  శాఖ ఇచ్చారు.  కార్యకర్తలు అందరూ గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల ప్రజలకు వివరించాలి. నియోజకవర్గానికి ఎక్కువ నిధులు తీసుకొచ్చి అభివృధి చేస్తాను..మంత్రి పదవి నాకు ముఖ్యం కాదు చెన్నూర్ ప్రజలు, నియోజకవర్గ అభివృద్ధి ముఖ్యం.  చెన్నూరును ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చి దిద్దుతాను. మనకు కొత్త గనులు కావాలని ఈ ప్రాంత ప్రజలు కోరారు. కొత్త గనుల కోసం  వేలంలో పాల్గొని సాధించుకొని అభివృద్ధి చేస్తాను.  నేను మంత్రిగా ఉన్నాను కాబట్టి కొత్త గనులు తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు వచ్చేలా చేస్తాను. నేను పోడు భూములు సమస్య పైన ఇప్పటికే కలెక్టర్ తో మాట్లాడి కాస్టులో ఉన్న వాళ్లను ఇబ్బందులు పెట్టొద్దని చెప్పాను అని వివేక్ అన్నారు.